Friday, June 11, 2021

శ్రీకృష్ణ విజయము - 254

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-248-సీ.
రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీ-
  శ్వరుఁడవై భవదీయ చారుదివ్య
లలితకళా కౌశలమున నభిరతుఁడై-
  కడఁగు నీ రూప మెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణసముచ్చయయుక్త మూఢాత్మ-
  నయిన నే నెక్కడ? ననఘచరిత!
కోరి నీ మంగళ గుణభూతి గానంబు-
  సేయంగఁబడు నని చెందు భీతి
10.2-248.1-తే.
నంబునిధి మధ్యభాగమం దమృత ఫేన
పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరు
నట్టి యున్నతలీల దివ్యంబు దలఁప.

భావము:
ఓ మహాత్మా! పుణ్యమూర్తీ! నీవు ప్రకృతి పురుషులకూ, కాలానికీ ఈశ్వరుడవు. కళాకౌశలంతో శోభించే నీ మనోహరమైన రూపము ఎక్కడ? త్రిగుణాలతో గూడిన మూఢురాలను నేనెక్కడ? నీ సద్గుణ సంపద దానం కీర్తింపబడుతుం దనే సందోహంతో ఎవరికీ అందకుండా పాలసముద్రంలో శేషతల్పంపై పవ్వళిస్తున్నావేమో. ఇటువంటి నీ లీలలు దివ్యములైనవి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=248

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: