Friday, August 16, 2019

కపిల దేవహూతి సంవాదం - 91


( గర్భ సంభవ ప్రకారంబు )

3-997-వ.
"అట్టి యీశ్వరుండు గాలత్రయంబు నందును జంగమ స్థావరాంత ర్యామి యగుటంజేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించు వారు తాపత్రయ నివారణంబు కొఱకు భజియింతురు" అని చెప్పి మఱియు నిట్లనియె.
3-998-క.
"జనయిత్రి! గర్భ మందును
ఘన క్రిమి విణ్మూత్ర రక్త గర్తము లోనన్
మునుఁగుచు జఠరాగ్నిని దిన
దినమును సంతప్యమానదేహుం డగుచున్.

భావము:
“ఆ భగవంతుడు మూడు కాలాల్లోనూ చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాసులలో అంతర్యామిగా ఉండడం వలన బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికై అతన్ని ఆరాధిస్తారు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “అమ్మా! జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ, ఆకలి మంటలతో దినదినం తపించే దేహం కలవాడై...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=998

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: