Friday, August 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 102


( చంద్రసూర్య పితృ మార్గంబు )

3-1014-వ.
అదియునుం గాక.
3-1015-తే.
ప్రవిమలానంత భోగితల్పంబు నందు
యోగనిద్రాళువై హరి యున్న వేళ
నఖిల లోకంబులును విలయంబు నొందు
నట్టి సర్వేశ్వరునిగూర్చి యలఘుమతులు.
3-1016-మ.
పరికింపన్ నిజభక్తి యుక్తిగరిమం బాటిల్లు పంకేరుహో
దరవిన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగముం
బరివర్జించి విశుద్ధచిత్తు లగుచుం బంకేజపత్రేక్షణే
తర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారిఁ జింతించుచున్.

భావము:
అంతేకాక అత్యంత నిర్మలమైన ఆదిశేషుని పానుపుమీద హరి యోగనిద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలూ ప్రళయాన్ని పొందుతాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైనవారు (ధ్యానిస్తారు). ఆ బుద్ధిమంతులు తమ భక్తిప్రపత్తులతో తమతమ ధర్మాలన్నింటినీ పద్మనాభునికే సమర్పించి, ప్రశాంత చిత్తులై, సర్వసంగ పరిత్యాగులై, పుండరీకాక్షుని ఆరాధన తప్ప ఇతర ధర్మాలనుండి దూరంగా ఉంటూ, నిత్యం ఆ దైత్యారినే ధ్యానిస్తూ (ఉంటారు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1016

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: