Saturday, December 29, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 83

10.1-583-వ.
అప్పుడు.
10.1-584-మ.
“చెలికాఁడా! యరుదెంచితే యిచటికిన్? క్షేమంబునం గ్రేపులున్
నెలవుల్ జేరె నరణ్యభూమివలనన్ నీ వచ్చునం దాకఁ జ
ల్దులు వీ రించుక యెవ్వరుం గుడువ; రా లోకింపు; ర”మ్మంచు నా
జలజాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింభకుల్.

భావము:
బ్రహ్మదేవుడి మాయా గుహనుండి పులినతలానికి కృష్ణబాలుడు తీసుకువచ్చిన సమయంలో (ఇసుకతిన్నెల మీద కూర్చుని చల్దులు తింటూ అర్థాంతరంగా ఆపు చేసిన గోపబాలురు కృష్ణుని చూసి ఇలా అన్నారు.) “చెలికాడా! వచ్చావా? ఇదిగో లేగదూడలు అరణ్య మధ్యం నుండి ఇప్పుడే తిరిగి వచ్చేసాయి. నీవు తిరిగివచ్చే వరకూ మాలో ఎవరమూ చల్దులు తినలేదు. చూడు. త్వరగారా! తిందాము.” అని పిలిచారు కృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి మధ్యలో కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చల్దులు తిన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=75&padyam=584

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: