Friday, November 10, 2017

పోతన రామాయణం - 34

9-322-క.
సమద గజదానధారల
దుమదుమలై యున్న పెద్ద త్రోవలతోడన్
రమణీయ మయ్యె నప్పురి
రమణుఁడు వచ్చినఁ గరంగు రమణియపోలెన్.
9-323-ఆ.
రామచంద్రవిభుని రాకఁ దూర్యములతో
రథ గజాశ్వ సుభటరాజితోడ
నమరెఁ బురము చంద్రుఁ డరుదేర ఘూర్ణిల్లు
జంతుభంగమిలిత జలధిభంగి.


భావము:
అప్పుడు ఆ పట్టణం మదించిన ఏనుగుల మదజల ధారలతో తడసిన రాజమార్గాలతో మనోహరంగా, భర్త రాకకై ఎదురు చూస్తున్న భార్యలా ఉంది. చంద్రుని రాకతో సాగరం ఉప్పొంగినట్లు, రామచంద్రుని రాకతో అయోధ్యా నగరం మంగళవాద్యములుతో; రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు, సైనికులుతో విలసిల్లింది.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: