Saturday, December 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 110

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1427-వ.
వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె.
10.1-1428-క.
"చెప్పెద మా గురునందనుఁ
దప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం
దెప్పించినాఁడ వాతని
నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"

భావము:
అలా వచ్చిన యముడు బలరామకృష్ణులను చూడగానే. వారు లీలావతారం ధరించిన విష్ణువు అవతార మూర్తులు అని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన కృష్ణుడికి నమస్సులు సమర్పించి. “నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించ” మని అడిగాడు. యముడి మాటలు విని ఆ పరమాత్మ ఇలా అన్నాడు. “ఓ పుణ్యశీలా! యమధర్మరాజా! చెబుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు చూసి దండించడం కోసం తెప్పించుకున్నావు. మాకు అతడు కావాలి, అప్పగించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1428

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: