Thursday, April 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౮(528)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1120-వ.
అదియునుం గాక, యుదకమయంబులైన తీర్థంబులును; మృచ్ఛిలామయంబు లైన దేవగణంబులును; దీర్థదేవతారూపంబులు గాకుండుట లే; దయిననవి చిరకాల సేవనార్చనలంగాని పావనంబు సేయవు; సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదు" రని వెండియు.

భావము:
అంతేకాకుండా, తీర్ధాలూ నీళ్ళతో నిండి ఉంటాయి; దేవతా ప్రతిమలు మట్టిచేత, రాతిచేత చేయబడి ఉంటాయి; అవి కూడా పరమ పవిత్రాలే అయినా వాటిని చాలాకాలం సేవించి పూజిస్తే కాని ఫలితం చేకూరదు. కానీ సత్పురుషులు తమ దర్శనం మాత్రం చేతనే పావనం చేస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1120

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: