Monday, April 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౩(513)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1093-క.
అమరేంద్ర తనయుఁ డమ్మ
త్స్యము నేయ నుపాయ మెఱిఁగి తగ నేసియు మీ
నము ద్రుంపలేక సిగ్గున
విముఖుండై చనియె నంత వికలుం డగుచున్.
10.2-1094-వ.
ఇట్లు సకల రాజకుమారులుం దమతమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ.

భావము:
ఇంద్ర తనయుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే ఉపాయం తెలిసినవాడే అయినా ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడు అయి, సిగ్గుతో వికలమైన మనసుతో వెనుదిరిగాడు. ఇలా తమ ప్రయత్నాలు ఫలించలేకపోడంతో ముడుచుకున్న ముఖాలతో ఆ రాకుమారులు అందరూ దైన్యంతో చిన్నబోయి చూస్తూ ఉండగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1094

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: