Saturday, April 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౧(511)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1087-క.
సుందరతనులు దదుత్సవ
సందర్శన కుతుకు లమిత సైన్యులు భూభృ
న్నందను లేతెంచిరి జన
నందితయశు లగుచు మద్రనగరంబునకున్.
10.2-1088-క.
చనుదెంచిన వారికి మ
జ్జనకుఁడు వివిధార్చనములు సమ్మతిఁ గావిం
చిన నా బాహుబలాఢ్యులు
ధనువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్.
10.2-1089-వ.
ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని. 

భావము:
సుందరాకారులైన ఆ రాజకుమారులు ఆ స్వయంవర ఉత్సవాన్ని తిలకించే కుతూహలంతో పెద్ద పెద్ద సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు. అలా విచ్చేసిన వారందరికి మాతండ్రి సంతోషంతో స్వాగతం పలికి సత్కరించాడు. బాహుబలసంపన్ను లైన ఆ రాజపుత్రులు ధైర్యంతో ధనువును సమీపించారు. అలా ఆ ధనుస్సు దగ్గరకు వెళ్ళి చూసిన మహా వీరులు... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1088 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

No comments: