Friday, October 11, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 14


( కలియుగ ధర్మంబు )

12-21-క.
"మూడవ యుగమున నెంతయు
వేడుక హరికీర్తనంబు వెలయఁగ ధృతిచేఁ
బాడుచుఁగృష్ణా! యనుచుం
గ్రీడింతురు కలిని దలఁచి కృతమతు లగుచున్. "

భావము:
“మూడవ యుగం అయిన ద్వాపరంలో "కృష్ణా" అని హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. హరిని స్తోత్రాలు ఆలపిస్తూ ఉంటారు. కలిని తలచి జాగ్రత్త పడువారు అయి భగవంతుని యందు క్రీడిస్తూ ఉంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=4&padyam=21

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: