Monday, October 7, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 10


( కల్కి అవతారము )

12-16-క.
ధర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతమును
నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా!
12-17-తే.
ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు
కాలవశమున నాయువు ల్గోలుపోయి
నామమాత్రావశిష్ఠు లైనారు; గాన
సలుపవలవదు మమత నెచ్చట నృపాల!

భావము:
ఓ మహారాజా! ధర్మం, సత్యం, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణుభక్తి, అనుపమ మహనీయ సత్కర్మ, అహింసావ్రతం అనే సుగుణాలు కలవారు మహా పుణ్యాత్ములు. మహారాజా! ఈ లోకాన్ని పాలించిన పూర్వ కాలపు రాజోత్తములు కాలానికి లొంగి, ప్రాణాలు కోల్పోయారు. కేవలం నామమాత్రావశిష్టులు అయ్యారు. మమత్వము అనేది చెప్పటానికి కూడ ఎప్పుడూ ఎక్కడా పనికి రాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=17

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: