Saturday, August 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 7

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1165-ఉ.
"పంపినఁ బోనివాఁడనె నృపాలక! మానవు లెన్న తమ్ము నూ
హింపరు దైవయోగముల నించుకఁ గానరు తోఁచినట్లు ని
ష్కంపగతిం చరింతు రది గాదన వచ్చునె? యీశ్వరేచ్ఛఁ ద
ప్పింపఁగ రాదు నీ పగతు బిడ్డలఁ దెచ్చెదఁ బోయి వచ్చెదన్."
10.1-1166-వ.
అని పలికి రథంబెక్కి యక్రూరుండు చనిన సకలజనులను వీడుకొలిపి కంసుం డంతిపురంబునకుం జనియె; నంతఁ గంస ప్రేరితుండై.

భావము:
“ఓ రాజా! నీవు ఆజ్ఞాపిస్తే వెళ్ళకుండా ఉంటానా? నిజానికి నరులు తమ శక్తి ఎలాంటిదో? దైవశక్తి ఎలాంటిదో? కొంచెము కూడ గ్రహించ లేరు. వారికి తోచినట్లు పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. దానిని కాదనలేం కదా. విధి నిర్ణయం తప్పించడం ఎవరి తరమూ కాదు. నేను వెళ్ళి నీ విరోధిపుత్రులను ఇక్కడికి తీసుకువస్తాను.” ఇలా చెప్పి, అక్రూరుడు రథం మీద వ్రేపల్లెకని బయలుదేరాడు. కంసుడు తక్కిన వారందరినీ పంపించి అంతఃపురంలోకి వెళ్ళాడు. అంత, కంసుడు పంపిన. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1165

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: