Friday, December 23, 2016

పోతనగారి వచన వైభవం


పోతనగారి వచన వైభవం ఇంతింతని చెప్పనలవి కాదు.
గోపికలు విరహం మన్మథబాణాలు అంటూ తెలుగు భాగవతం దశమ స్కంధ పూర్వ భాగం లోని గోపికల వేణునాధుని వర్ణన ఘట్టం అందలి 10.1-189 వచనం చిన్న ఉదాహరణ. సరదాగా తలచుకుందాం దీనిని.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=96&Padyam=798
గోపికల వేణునాధుని వర్ణనలోని 10.1-189-వ.
బృందావనంలో విహరిస్తున్న మాధవుడిని చూసి మదనుడి భాణ పరంపరలచే పీడింపబడే మనసులతో ఏకాంతంలో చింతిస్తూ తదేక ధ్యానపరాయణులు అయ్యారట. ఈ భావం స్పురించే ఆ భాగవత వచనంలోని పదాల కూర్పు చూడండి.
తత్పరాయణులు అయినవారు వల్లవకాంతలుట. వల్లవ అంటే గొల్ల అనీ భీమ అని నిఘంటువు, వల్లవుము అంటే అనుకూలించు అని అర్థం, మరి వల్లవ కాంతలు అంటే గొల్ల భామలా, బలమైన స్థిరమైన కాంచుట కలవారా, అనుకూల దృక్పదం కలవారా?
ఎందుకు అంతటి ఏకాంతాలు అంటే పంచభాణభల్ల. మరి పంచబాణ మన్మథుడి 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అనెడి ఐదు బాణాలచేతనా, 1 మోహము, 2 మహామోహము, 3 అంధతామిశ్రమము, 4 తామిశ్రమము, 5 చిత్తభ్రమ అనే అజ్ఞాన పంచకములనే బాణములచేతనా. మరి రెండోవి అయితే గోవిందుడు - గోవులకు ఒడయుడు, జ్ఞానులకు ప్రభువు పై ఏంకాత భక్తి తప్ప మరొక దారి లేదు కదా. అదేనా ఈ బృందావన విహారం.. . .
 - -
అవిద్యా పంచకం

No comments: