Thursday, December 1, 2016

వామన వైభవం - 41:

8-534-క.
గుజగుజలు పోవువారును
గజిబిజిఁ బడువారు చాలఁ గలకల పడుచున్
గజిబిజి యైరి సభాస్థలిఁ
బ్రజ లెల్లను బొట్టివడుగు పాపని రాకన్.
8-535-వ.
ఆ సమయంబున బలిసభామండపంబుఁ దఱియం జొచ్చి.

టీకా:
గుజగుజలు = గుసగుసలు; పోవువారును = ఆడువారును; గజిబిజిన్ = తికమక; పడువారు = పడువారును; చాలన్ = మిక్కలి; కలకల = కలకలము; పడుచున్ = పడుచు; గజిబిజిన్ = తికమకపడినవారు; ఐరి = అయిరి; సభాస్థలిన్ = సభాప్రాంగణములోని; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; పొట్టి = వామనరూపు; వడుగు = బ్రహ్మచారి; పాపని = పిల్లవాని; రాకన్ = వచ్చుటతో. ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బలి = బలియొక్క; సభామండపంబున్ = సభాస్థలి; దఱియన్ = దగ్గరకు; చొచ్చి = చేరి.

భావము:
పొట్టి బ్రహ్మచారి యైన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు. కొందరు గజిబిజి పడ్డారు. కొందరు తికమక పడ్డారు. అలా ఆ సభలోని వారందరూ పెద్ద కలకలం చేసారు. సభలో అలా కలకలం జరుగుతుండగా, ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభమంటపం దరిచేరాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=534

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

No comments: