Sunday, September 22, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 2


( రాజుల ఉత్పత్తి )

12-5-క.
చతురత నీ క్షితి నేలియు
మతిమోహము విడువలేక మానవనాథుల్
సతతముఁ దమ కీ కాలం
బతిచంచల మగుట నెఱుఁగరయ్య మహాత్మా!
12-6-క.
నరపతులమహిమ నంతయు
నురగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం
జిరకాల మేలి యిందే
పరువడి నడఁగుదురు వారు భ్రాంతులు నగుచున్.

భావము:
ఓ మహాత్మా! వీరు ఎంతో నేర్పుతో పరిపాలన కొనసాగిస్తారు. కానీ, తమ అంతరంగాలలో మోహాన్ని వీడలేరు. కాలం మిక్కిలి చంచలమైనది అని తెలుసుకోలేరు. ఆ రాజుల గొప్పతనాన్ని ఆ వెయ్యితలల ఆదిశేషుడైనా సమగ్రంగా చెప్పలేడు. వారు చాలాకాలం భూమిని ఏలుతారు. అయినా భ్రాంతి మగ్నులై ఇక్కడే అణగిపోతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=6

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: