Saturday, April 8, 2017

మత్స్యావతార కథ -26:



8-738-క.
జలరుహనాభుని కొఱకై
జలతర్పణ మాచరించి సత్యవ్రతుఁ డా
జలధి బ్రతికి మను వయ్యెను;
జలజాక్షునిఁ గొలువ కెందు సంపదఁ గలదే?

భావము:
పద్మనాభుడు అయిన విష్ణుదేవుడికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలో నుండి బయటపడి మనువు అయ్యాడు. ఆ పద్మాక్షుడిని విష్ణువును పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=91&padyam=738

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: