Friday, April 7, 2017

మత్స్యావతార కథ - 25:


8-736-వ.
అయ్యవసరంబున.
8-737-ఆ.
వాసవారిఁ జంపి వాని చేఁ బడియున్న
వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి
నిదుర మాని యున్న నీరజాసనునకు
నిచ్చెఁ గరుణతోడ నీశ్వరుండు.

భావము:
ఆ సమయంలో.... భగవంతుడు ఇంద్రుడి శత్రువు అయిన హయగ్రీవుణ్ణి చంపేసి, వాడు అపహరించిన వేదాల చెర విడిపించాడు. వాటిని తెచ్చి నిద్ర లేచిన బ్రహ్మదేవుడికి దయతో పూర్వకంగా అప్పగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=91&padyam=737

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: