Monday, April 3, 2017

మత్స్యావతార కథ - 21:



8-728-క.
పెఱవాఁడు గురు డటంచును
గొఱగాని పదంబు చూపఁ గుజనుండగు నీ
నెఱ త్రోవ నడవ నేర్చిన
నఱమఱ లేనట్టిపదమునందు దయాబ్ధీ!



8-729-మ.
చెలివై చుట్టమవై మనస్థ్సితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
వలనై కోర్కులపంటవై విభుఁడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటంబడి లోక మక్కట; వృథా బద్దాశమై పోయెడిన్
నిలువన్ నేర్చునె హేమరాశిఁ గనియున్ నిర్భాగ్యుఁ డంభశ్శయా!

భావము:
దయా సముద్రుడవు అయిన శ్రీ మహావిష్ణువా! పనికిమాలినవాడిని గొప్ప వాడు అనుకొని దరిచేరేవారు చెడిపోతారు. నిన్ను నమ్ముకొని మంచిమార్గంలో నడవగలిగితే సందేహం లేకుండా అభేద రూపమైన ముక్తిని పొందుతాడు. నారాయణా! మత్య్యావతారా! నీవు స్నేహితుడుగా, బంధువుగా, జ్ఞానస్వరూపుడుగా, మానవుల మనస్సులోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువు అయి కోరికలు పండిస్తావు. అటువంటి నిన్ను ఆనుసరించకుండా, లోకం ఏవేవో అనవసరపు పేరాశలకు బంధీ అయిపోయి పరుగులు పెడుతుంది. అదృష్టహీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=729

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: