Monday, July 2, 2018

శ్రీకృష్ణ లీలలు - ౩౭

10.1-354-వ.
అంత నొక్కనాఁడు తన యింటికడ పాప లందఱు నయ్యై పనులందుఁ బంపుపడిపోయిన నందసుందరి సంరంభంబునం దరికంబంబు కడఁ గుదురున నొక్క దధికుంభంబు పెట్టి మిసిమిగల మీఁగడపెరుగు గూడంబోసి వీఁక నాఁక త్రాడు కవ్వంబున నలంవరించి.


భావము:
ఒక రోజు యశేదాదేవి ఇంటివద్ద ఉన్న యువతులు అందరూ వారి పనులమీద వెళ్ళిపోయారు. యశోదాదేవి పెరుగు చిలకడానికి చిలుకు స్తంభం వద్ద కుదురు పెట్టి, దానిమీద పెరుగు కుండను పెట్టింది. తరిత్రాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలు పెట్టింది.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: