Wednesday, September 6, 2017

శ్రీ కృష్ణ జననం -33

10.1-113-క.
స్నానముచేయఁగ రామిని
నానందరసాబ్ధిమగ్నుఁడై విప్రులకున్
ధేనువులం బదివేలను
మానసమున ధారవోసె మఱి యిచ్చుటకున్.
10.1-114-వ.
మఱియు వసుదేవుండు.
10.1-115-క.
"ఈ పురిటియింటి కుద్య
ద్దీపంబును బోలి చాల దీపించె నిజం
బీ పాపఁడు నలు మొగముల
యా పాపని గనిన మేటి యగు" నని భక్తిన్.

భావము:
స్నానం చేయడం వీలుకాకపోవుట చేత ఆనంద రసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు "పదివేల ఆవులు దానం చేస్తున్నాను" అని మానసికంగా ధారపోసాడు. ఇంకా వసుదేవుడు. ఇంకా వసుదేవుడు “పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ పాపడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని కన్న మహానుభావుడు అయిన విష్ణుమూర్తే.” అని అనుకొన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=11&padyam=113

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

1 comment:

విష్వక్సేనుడు said...

నమస్కారం _/\_
మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.