Friday, October 27, 2017

పోతన రామాయణం - 20

9-295-వ
అంత.
9-296-క.
తనవా రందఱు మ్రగ్గిన
ననిమిషపతివైరి పుష్పకారూఢుండై
యనికి నడచి రామునితో
ఘనరౌద్రముతోడ నంపకయ్యము చేసెన్.

భావము:
అప్పుడు తనవైపు ముఖ్య వీరులంతా మరణించగా, రావణుడు పుష్పకవిమానం ఎక్కి యుద్దానికి వెళ్ళి శ్రీరామునితో గొప్ప పౌరుషంతో యుద్దం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=296

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: