Monday, October 22, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 35

10.1-500-మ.
“వినుఁ డో! బాలకులార! క్రేపు లటవీవీధిన్ మహా దూరముం
జనియెన్ గోమల ఘాసఖాదన రతోత్సాహంబుతో నెందుఁ బో
యెనొ? యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో? 
కని తెత్తుం గుడువుండు చల్ది గొఱఁతల్ గాకుండ మీ రందఱున్.”
10.1-501-వ.
అని చెప్పి,


భావము:
“ఓ మిత్రులారా! మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి, ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి నట్లున్నాయి. ఎక్కడకి వెళ్ళాయో యే మయ్యాయో? ఏ క్రూరజంతువుల కైనా చిక్కి ఆపదలో పడ్డాయో? ఏమిటో? నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి.” అని చెప్పి బయలుదేరాడు. ఇలా తన సహచరులకు చల్దులు తింటూ ఉండమని చెప్పిన కృష్ణుడు....



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: