Tuesday, September 25, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 20

10.1-465-క.
బకునికిఁ దమ్ముఁడు గావున
బకమరణముఁ దెలిసి కంసు పంపున గోపా
లక బాలురఁతోఁ గూఁడను
బకవైరినిఁ ద్రుంతు ననుచుఁ బటురోషమునన్.
10.1-466-క.
బాలురు ప్రాణంబులు గో
పాలురకు; మదగ్రజాతు ప్రాణము మా ఱీ
బాలురఁ జంపిన నంతియ
చాలును; గోపాలు రెల్ల సమసిన వారల్.

భావము:
ఆ అఘాసురుడు బకాసురుడి తమ్ముడు. కంసుడి ఆజ్ఞానుసారం అతడు తన తమ్ముడిని చంపినవాడిని తోడి బాలకులతో సహా చంపుతాను అని గర్వంతో రెచ్చిపోయి బయలుదేరాడు. అఘాసురుడు “గోపాలకులకు ప్రాణాలు వారి మగ పిల్లలు. మా అన్న బకాసురుని ప్రాణానికి బదులుగా ఈ పిల్లగాళ్ళను చంపేస్తే చాలు. గోపాలకులు అందరూ చచ్చినట్లే.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=466

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: