Monday, October 9, 2017

పోతన రామాయణం - 14

9-282-వ.
ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబు జొచ్చి యిట్లని స్తుతియించె.
9-283-శా.
"ఓ కాకుత్స్థకులేశ! యోగుణనిధీ! యోదీనమందార! నే
నీ కోపంబున కెంతవాఁడ? జడధిన్; నీవేమి భూరాజవే? 
లోకాధీశుఁడ; వాదినాయకుఁడ; వీ లోకంబు లెల్లప్పుడున్
నీ కుక్షిం బ్రభవించు; నుండు; నడఁగున్; నిక్కంబు సర్వాత్మకా!

భావము:
ఇలా ఆపదపాలైన సముద్రుడు నదులతో కలిసి రూపు ధరించి వచ్చి శ్రీరాముని పాదాలను శరణువేడాడు. ఇంకా ఈ విధంగా స్తోత్రం చేసాడు. “ఓయీ! కాకుత్స్థుని వంశ ప్రభువ! ఓ సుగుణనిధీ! ఓ దీనమందార! సర్వాత్మకా! శ్రీరామా! నేను జడస్వభావిని. నీ కోపాన్ని తట్టుకోలేను. నీవు ఏమైనా సామాన్యరాజువా? సకల జగత్తులకు విభుడవు. మూలపూరుషుడవు, ఎల్లప్పుడు నీ కడుపులో సకల భువనాలు సృష్టింపబడుతూ, మనుతూ, లయమవుతూ ఉంటాయి. ఇది సత్యం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=283

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: