Sunday, April 16, 2017

దక్షయాగము - 4:

4-39-క.
చనుదెంచిన యా దక్షుఁడు
వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్
తన కిచ్చిన పూజలు గై
కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్.
4-40-తే.
తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ
నాసనము దిగనట్టి పురారివలను
గన్నుఁ గొనలను విస్ఫులింగములు సెదరఁ
జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ.

భావము:
వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని... తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా గద్దె దిగని శివునివైపు తన కంటికొనలనుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో (ఇలా అన్నాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=40

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: