Friday, March 31, 2017

మత్స్యావతార కథ - 18:


8-722-మ.
చని సత్యవ్రతమేదినీదయితుఁ డోజం బూని మ్రాన్దీఁగె వి
త్తనముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
ముని సంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచుం
గనియెన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ మీనమున్.
8-723-వ.
కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁ బాపత్రాటన నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె.

భావము:
సత్యవ్రతుడు ఉత్సాహంతో ఆ ఓడ దగ్గరకు వెళ్ళి, అనేక ఓషధులను విత్తనాలను దాని మీద ఎక్కించాడు. విష్ణువును స్త్రోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావను ఎక్కాడు. భయంభయంగా సముద్రం మీద తేలుతూ పోతున్నాడు. అప్పుడు ఆయనకు భక్తులహృదయాలకు అలంకారమైన విష్ణువు మహామీనస్వరూపంతో ఎదుట కనిపించాడు. అలా కనబడిన మహా మీనరూపుని కొమ్ముకు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును త్రాడుగా చేసి ఆ ఓడను కట్టివేసాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకున్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణువును ఈవిధంగా పొగడసాగాడు. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=722

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: