Wednesday, March 29, 2017

మత్స్యావతార కథ - 16:

8-719-వ.
ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి.
భావము:
అలా భగవంతుడు శ్రీమహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించాడు. సముద్రంలో ప్రవేశించి . .. . .
8-720-సీ.
ఒకమాటు జలజంతుయూథంబులోఁగూడు;
నొకమాటు దరులకు నుఱికి వచ్చు;
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు;
నొకమాటు లోపల నొదిఁగి యుండు;
నొకమాటు వారాశి నొడలు ముంపమిఁ జూచు;
నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలఁచు;
నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు;
నొకమాటు జలముల నుమిసి వైచు;

భావము:
అతడు తళతళలాడే పెనురూపంతో ప్రళయజలాలలో వేదాలకోసం వెదకటానికి పూనుకున్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్ళ లోపల దాగి ఉంటాడు. ఒకసారి సమద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మండాన్ని ఒరసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును పట్టి మ్రింగుతాడు. ఒకసారి నీళ్ళను పీల్చి వెలుపలికి చిమ్ముతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=89&padyam=720

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: