Saturday, February 25, 2017

త్రిపురాసుర సంహారం - 2:


7-389-క.
ఏ కర్మంబున విభుఁడగు 
శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియెన్
వైకుంఠుఁ డెవ్విధంబునఁ
గైకొని తత్కీర్తి చక్కఁగా నొనరించెన్.
7-390-వ.
అనిన నారదుం డిట్లనియె.

టీకా:
ఏ = ఎట్టి; కర్మంబునన్ = కార్యమువలన; విభుడు = ప్రభువు; అగు = అయిన; శ్రీకంఠుని = పరమశివుని {శ్రీకంఠుడు - (క్షీరసాగరమధనమున పుట్టిన హాలాహలమును మింగుటవలన) శోభ కంఠమునగలవాడు, శివుడు}; యశము = కీర్తి; మయుని = మయుడి వలన; సుడివడియెన్ = చలించినది; వైకుంఠుడు = హరి {వైకుంఠుడు - ఒక యవతారమున వికుంఠ యనెడి యామె పుత్రుడు, కుంఠత్వము (మొక్కపోవుట, మౌఢ్యము) లేనివాడు, విష్ణువు}; ఏ = ఏ; విధంబునన్ = విదముగ; కైకొని = చేపట్టి; తత్ = అతని; కీర్తిన్ = యశస్సును; చక్క = ఒప్ప; కాన్ = అగునట్లు; ఒనరించెన్ = చేసెను. అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
మయుడి ఏ పని వలన నీలకంఠుడైన శంకరుని యశస్సుకు కళంకం ఎలా కలిగింది. వైకుంఠవాసుడు శ్రీహరి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు. అలా ధర్మరాజు అడుగగా, నారదుడు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=389




: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: