Friday, February 10, 2017

వామన వైభవం - 112:

8-655-వ.
వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె.
8-656-క.
నీకుం గ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోకములకు రాజవీవ లోకస్తుత్యా!

టీకా:
వచ్చి = వచ్చి; ఆ = ఆ; చేడియ = వనిత; తత్ = అతని; చరణ = పాదముల; సమీపంబునన్ = వద్ద; ప్రణత = నమస్కరించినది; ఐ = అయ్యి; నిలువంబడి = నిలబడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. నీ = నీ; కున్ = కు; క్రీడార్థము = సంచరించు విహారస్థలాలు; అగు = అయిన; లోకంబులన్ = లోకములను; చూచి = చూసి; పరులు = ఇతరులు; లోకులు = ప్రజలు; కుమతుల్ = మూర్ఖులు; లోక = లోకములకు; అధీశులము = పాలకులము; అందురు = అనుకొనెదరు; లోకముల్ = సర్వలోకములకు; రాజవు = రాజువు; ఈవ = నీవుమాత్రమే; లోకస్తుత్యా = నారాయణ {లోకస్తుత్య - సర్వలోకముల స్తుతింపబడువాడు, విష్ణువు}.

భావము:
అలా చేర వచ్చిన వింద్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఆఇల్లాలు ఇలా అన్నది.
“ఓ లోకపూజ్యుడా! లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=656

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: