Friday, November 4, 2016

శుభవార్త


::చదువుకుందాం భాగవతం :: బాగుపడదాం మనం అందరం::
శుభవార్త
          2016 తెలుగు ప్రపంచ సాహితీ సమావేశాలు సింగపూరులో నవంబరు 5, 6 వ తారీఖులలో జరుగుతున్నాయి. . .
1.        తెలుగుభాగవతం.ఆర్గ్ మరియూ తెలుగు భాగవత ప్రచార సమితి, వాటిలో భాగంగా 5వ తారీఖు సింగపూరు కాలమానం ప్రకారం మధ్యాహ్నం మన తెలుగుభాగవతం నేపధ్యంలో భాగవత విశిష్టతను గురించి ప్రసంగం / పరిచయం చేయిస్తోంది. మన భాగవత బంధువు భాస్కర కిరణ్ ఈ ప్రసంగం చేయబోతున్నాడు.
 2.       ఇదే సందర్భంలో భాస్కర కిరణ్ అద్వర్యంలో సింగపూరులో మన భాగవత బంధువు ఫణికిరణ్ ప్రచురణ మన తెలుగు భాగవతం చరణిగ్రంథం (మొబైల్ బుక్) ఆవిష్కరణ కూడా చేస్తున్నాము.
3.        అదే రోజు అనగా 2016, నవంబరు – 05 సాయంకాలం 5.00 గంటలకు, 1వ సెక్టారు, హెచ్ఎస్ఆర్ లే అవుటు, వినాయ దేవాలయ ప్రాంగణం, బెంగళూరులో పై తెలుగు భాగవతం చరణిగ్రంథం (మొబైల్ బుక్) ఆవిష్కరణ కూడా చేస్తున్నాము. ప్రచురణ కర్త భాగవత బంధువు ఫణికిరణ్.
          ఈ కార్యక్రమాలు సుసంపన్నంగా, జయప్రదంగా జరిగేలా మానల్లనయ్య అనుగ్రహించు గాక. తద్వారా తెలుగుల పుణ్యకోటి పోతన పోతపోసిన ఈ మహా గ్రంథం మన తెలుగులకు మరింత చేరువై మరింత బాగుపడేలా అనుగ్రహించు గాక . . .
          మాన్యులారా పేరు పేరునా మిమ్మల్ని అందరిని ఈ కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలను ఆశీర్వదించి సభలను సుసంపన్నం చేయించవలసినదిగా కోరుచున్నాను.

::చదువుకుందాం భాగవతం :: బాగుపడదాం మనం అందరం::

No comments: