Sunday, October 30, 2016

వామన వైభవము : ప్రజలకు

8-472-క.
ప్రలకు నెల్లను సముఁడవు 
ప్రలను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం
బ్రలందు దుష్టమతులను
నిముగ శిక్షింప వలదె నీవు? మహాత్మా!
8-473-మ.
సులన్ సభ్యుల నార్తులన్ విరథులన్ శోకంబు వారించి ని
ర్జధానిన్ నిలుపంగ రాత్రిచరులన్ శాసింప సత్కార్య మే
వె వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే
రుణాలోక సుధాఝరిం దనుపవేళ్యాణ సంధాయకా! "
8-474-వ.
అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె.

టీకా:
          ప్రజలన్ = సంతానమునకు; ఎల్లను = అందరిపట్లను; సముడవు = సమానంగచూచువాడవు; ప్రజలను = సంతానమును; కడుపారన్ = కడుపునిండుగా; కన్న = పుట్టించినట్టి; బ్రహ్మవు = ప్రజాపతివి; అయ్యున్ = అగుటచేత; ప్రజల్ = పిల్లల; అందున్ = లో; దుష్ట = చెడు; మతులను = బుద్దులుగలవారిని; నిజముగన్ = తప్పక; శిక్షింపవలదె = శిక్షించవలెనుకదా; నీవు = నీవు; మహాత్మా = గొప్పవాడా.
          సురలన్ = దేవతలను; సభ్యులన్ = మర్యాదస్తులను; ఆర్తులన్ = దుఃఖితులను; విరథులన్ = ఓడిపోయినవారిని; శోకంబున్ = దుఃఖమును; వారించి = పోగొట్టి; నిర్జరధాని = అమరావతియందు {నిర్జరధాని -దేవతలరాజధాని, అమరావతి}; నిలుపంగ = నిలబెట్టుటకు; రాత్రిచరులన్ = రాక్షసులను; శాసింపన్ = శిక్షించుట; సత్కార్యము = మంచిపని; ఈ = ఈలాగు; వెరవు = ఆవటము; ఏరీతిన్ = ఏవిధముగ; ఘటిల్లున్ = నెరవేరుతుందో; అట్టి = అటువంటి; క్రమమును = పద్దతిని; వేగంబ = శ్రీఘ్రమే; చింతింపవే = ఆలోచించుము; కరుణ = దయకల; ఆలోక = చూపులు యనెడి; సుధా = అమృతపు; ఝరిన్ = ప్రవాహమునందు; తనుపవే = ముంచెత్తుము; కల్యాణ = శుభములను; సంధాయికా = కలిగించెడివాడ.
          అనినన్ = అనగా; మనోవల్లభ = భార్య {మనోవల్లభ - మనసునకు వల్లభ (నాయిక), సతి}; పలుకుల్ = మాటలు; ఆకర్ణించి = విని; ముహూర్తమాత్రంబు = కొంచముసేపు; చింతించి = ఆలోచించి; విజ్ఞానదృష్టిన్ = దివ్యదృష్టిని; అవలంభించి = సారించి; భావి = రాబోవు; కాల = కాలము; కార్యంబున్ = సంగతులు; విచారించి = ఆలోచించి; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:
            మహాత్మా! కశ్యపా! బిడ్డలు అందరి ఎడలా నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతివి కాబట్టి, నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా.
            మహానుభావా! సకల కల్యాణాలను సమకూర్చే వాడవు నీవు. ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు. భాగ్యాలు కోల్పోయారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడమూ, రాక్షసులను శిక్షించడమూ చేయవలసిన మంచిపని. తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు."
ఇలా అంటున్న తన ప్రియ భార్య మాటలు విని, కశ్యపప్రజాపతి కొంచెంసేపు ఆలోచించాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకుని ఇలా అన్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: