Saturday, September 24, 2016

క్షీరసాగరమథనం – సారథి

8-362-వ.
అయ్యెడ
8-363-క.
సాథి వేయు హయంబుల
తే రాయిత పఱచి తేర దేవేంద్రుఁడు దా
నారోహించెను దైత్యుఁడు
దాత మాతలిని శూలధారం బొడిచెన్.

టీకా:
            ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.
            సారథిన్ = సారథి; వేయు = వెయ్యి (1,000); హయంబులన్ = గుర్రములను; తేరు = రథమును; ఆయిత = సిద్దము; పఱచి = చేసి; తేర = తీసుకురాగా; దేవేంద్రుడు = ఇంద్రుడు; తాన్ = అతను; ఆరోహించెను = ఎక్కెను; దైత్యుడు = రాక్షసుడు; ఉదారతన్ = గట్టిగా; మాతలిని = సారథిని; శూల = శూలము యొక్క; ధారన్ = వాడిదనముతో; పొడిచెన్ = పొడిచెను.

భావము:
          జంభాసురుని గదాఘాతానికి ఐరావతం నేలకు వాలిపోయిన ఆ సమయంలో . . .
          ఇంద్రుని సారథి అయిన మాతలి, వెయ్యి (1000) గుర్రాలను పూన్చిన రథాన్ని సిద్ధం చేసి తెచ్చాడు. ఇంద్రుడు అధిరోహించాడు. అప్పుడు ఆ బంభాసురుడు వాడియైన బల్లెంతో మాతలిని గట్టిగా పొడిచాడు,


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: