Sunday, May 22, 2016

క్షీరసాగరమథనం - వరదునిఁ

8-152-క.
దునిఁ బరము జగద్గురు
రుణాపరతంత్రు మనము నుఁగొన దుఃఖ
జ్వములు చెడు నని సురలకు
సిజజని చెప్పి యజితు దనంబునకున్.
టీకా:
          వరదుని = వరాలిచ్చెడివానిని; పరమున్ = పరమాత్ముని; జగద్గురున్ = లోకాలనుకాపాడువాడు {గురువు - 1ఉపాధ్యాయుడు 2బృహస్పతి 3కులముపెద్ద 4తండ్రి 5తండ్రితోడబుట్టినవాడు 6తాత 7అన్న 8మామ 9మేనమామ 10రాజు 11కాపాడువాడు}; కరుణాపరతంత్రున్ = కృపావశీకరుని; మనమున్ = మనమందరము; కనుగొనన్ = దర్శించినచో; దుఃఖ = శోకములు; జ్వరములున్ = బాధలు; చెడును = నశించును; అని = అని; సురల్ = దేవతల; కున్ = కు; సరసిజజని = బ్రహ్మదేవుడు {సరసిజజని - సరసిజ (పద్మము)నందు జని (పుట్టినవాడు), బ్రహ్మ}; చెప్పి = తెలిపి; అజితుసదనంబున్ = వైకుంఠమున {అజితుసదనము - అజితు (జయింపరాని వాడు, విష్ణువు) యొక్క సదనము (నివాసము), వైకుంఠము}; కున్ = కు.
భావము:
          వరాలు ఇచ్చే వాడు, పరమాత్ముడూ, సకల లోకాలకు తండ్రి, దయామయుడు అయిన ఆ స్వామిని దర్శనం చేసుకుంటే, మన దుఃఖాలు, బాధలూ అన్నీ దూరం అవుతాయి.” అని, చెప్పి బ్రహ్మదేవుడు వేగంగా అజితుడు అయిన ఆ భగవానుని స్థానానికి వెళ్ళాడు.
8-152-ka.
varaduniM~ baramu jagadguru
karuNaaparataMtru manamu ganuM~gona du:kha
jvaramulu cheDu nani suralaku
sarasijajani cheppi yajitu sadanaMbunakun.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: