Friday, May 13, 2016

క్షీరసాగరమథనం - చక్షుస్తనూజుండు

8-141-సీ.
క్షుస్తనూజుండు చాక్షుషుం డను వీరుఁ;
 డాఱవ మనువయ్యె వనినాథ! 
భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు;
లాతని నందనుమరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁ; ర్త్యు లాప్యాదికు;
 లాహవిష్మద్వీరకాది ఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజు;
 నకుఁ బుట్టి యజితుండు నాఁ నొప్పె;
8-141.1-ఆ.
తఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని;
నుదధి జలములోన నుండి మోచె
తఁడు చువ్వె దివిజు ర్థింప నమృతాబ్ధిఁ
ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
టీకా:
చక్షుస్ = చక్షుస్సు యొక్క; తనూజుండు = పుత్రుడు; చాక్షుసుండు = చాక్షుషుడు; అను = అనెడి; వీరుడు = శ్రేష్ఠుడు; ఆఱవ = అరో (6); మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అవనినాథ = రాజ; భూమీశ్వరులు = రాజులు; పురుః = పురువు; పురుష = పురుషుడు; సుద్యుమ్న = సుద్యుమ్నుడు; ఆదులు = మొదలగువారు; ఆతని = అతని యొక్క; నందనులు = పుత్రులు; అమరవిభుడు = ఇంద్రుడు; మంత్రద్యుమ్న = మంత్రద్యుమ్నుడు అను; ఆఖ్యుడు = పేరుగలవాడు; అమర్త్యులు = దేవతలు; ఆప్యా = ఆప్యాయుడు; ఆదికులు = మొదలైనవారు; ఆ = ; హవిష్మత్ = హవిష్మంతుడు; వీరక = వీరకుడు; ఆది = మున్నగు; ఘనులు = గొప్పవారు; మునులు = సప్తర్షులు; విభుడు = విష్ణుమూర్తి; సంభూతి = సంభూతి; కిన్ = కి; వైరాజున్ = వైరాజున; కున్ = కు; పుట్టి = పుట్టి; అజితుండు = అజితుడు; నాగ = అనగా; ఒప్పెన్ = ఒప్పియుండెను; అతడు = అతడు. 
కాడె = కాదా; కూర్మము = కూర్మావతారుడు; ఐ = అయ్యి; మందర = మందర యనెడి; అద్రిని = పర్వతమును; ఉదధి = సముద్ర; జలము = నీటి; లోనన్ = లోపల; ఉండి = ఉండి; మోచెన్ = మోసెను; అతడు = అతడు; చువ్వె = సుమా; దివిజులు = దేవతలు; అర్థింపన్ = కోరగా; అమృతాబ్దిన్ = పాలసముద్రమును; త్రచ్చి = చిలికి; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ; సుధారసంబున్ = అమృతమును.
భావము:
పరీక్షిత్తు మహారాజా! ఆరవ మనువుగా, చక్షువు అను వాని పుత్రుడు చాక్షుషుడు అయ్యాడు. ఆ చాక్షుస మన్వంతరంలో, అతని కొడుకులు అయిన పురుడు, పురుషుడు , సుద్యుమ్నుడు మున్నగువారు రాజులు అయ్యారు; మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు; ఆప్యాదులు దేవతలు అయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు; వైరాజుకీ సంభాతికీఅజితుడు” అనే పేరుతో విష్ణువు పుట్టాడు. అతడే కూర్మరూపం ధరించి మంథర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. దేవతలు ప్రార్థించగా క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని దేవతలకు అందించాడు.
విశేష వివరణ= చతుర్దశ మన్వంతరాలలో నాలుగవది (4) అయిన, తామస మన్వంతరంలో గజేంద్ర మోక్షం ఘట్టం జరిగింది. తరువాత అయిదవది (5) అయిన రైవత మన్వంతరం, ఆ తరువాతది ఆరవది అయిన చాక్షుస మన్వంతరం. ఈ మన్వంతరంలో క్షీరసాగర మధనం జరిగింది. ఆ పిమ్మట వచ్చినది ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వత మన్వంతరం.
8-141-see.
chakShustanoojuMDu chaakShuShuM Danu veeruM~; DaaRrava manuvayye navaninaatha!
bhoomeeshvarulu puru: puruSha sudyumnaadu; laatani naMdanu; lamaravibhuM~Du
maMtradyumaakhyuM~; Damartyu laapyaadiku; laahaviShmadveerakaadi ghanulu
munulaMdu vibhuM~Du saMbhootiki vairaaju; nakuM~ buTTi yajituMDu naaM~ga noppe;
8-141.1-aa.
nataM~Du kaaM~De koormamai maMdaraadrini; nudadhi jalamulona nuMDi mOche;
nataM~Du chuvve diviju larthiMpa namRitaabdhiM~; drachchi yichche naa sudhaarasaMbu.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: