Saturday, February 14, 2015

2015-ఫిబ్రవరి-13 - శ్రీ చింతా రామకృష్ణారావుగారి ఇంటివద్ద - సత్సంగం.

కుడి నుండి ఎడమకు శ్రీ చింతా రామకృష్ణారావు గారు, వారి శ్రీమతి, ఊలపల్లి లలిత, ఉలపల్లి సాంబశివ రావు, గుత్తి చంద్రశేఖర రెడ్డిగారు, అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డిగారు, రామమోహను గారు.

         2015-02-13న అనగా జయనామ సంవత్సర, మాఘ మాస బహుళ నవమి శుక్రవారం, శ్రీ చింతా రామకృష్ణారావు గారి గృహములో సత్సంగం సందర్భంగా శ్రీమాన్ చింతా రామకృష్ణా రావు గారు ఆత్మీయ సత్కారం చేసారు. ఆ విధంగా ఆత్మీయులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారు, శ్రీ రామమోహను గారు, శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి గారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నరాయణ రెడ్డి గారు ప్రభ్రుతుల తో కొద్ది సమయం ఆనంద పారవశ్యం చెందే అవకాశం చిక్కింది. శ్రీకృష్ణదేవరాయల పీఠం వద్ద అభినవ ఆంధ్ర భోజుల వారి దర్శన భాగ్యం కూడా లభించింది. అక్కడి కక్కడ నా శ్రేయోభిలాషులు కవి శ్రేష్ఠులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారు హార్దిక స్పందనతో చెప్పిన శార్దూల విక్రీడితం.

శా.

శ్రీద్భాగవతోత్తముల్ గణన సుశ్రేయోను సంధానకుల్
మామీదన్ దయఁ జూపి వచ్చితిరి యేమా భాగ్య మీనాడు మీ
ప్రేమన్ లోకులు భక్తి పూర్ణులగుటే శ్రేయంబు యోచింప మీ
క్షేమంబున్ గను బాలకృష్ణుడు సదా శ్రేయంబులన్ గూర్చుచోన్. 

No comments: