Wednesday, July 24, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_6


7-166-క.
"దివించిరి నను గురువులు
దివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
దివినవి గలవు పెక్కులు
దువులలో మర్మ మెల్లఁ దివితిఁ దండ్రీ!
గురువుల దగ్గర యేం నేర్చుకొన్నా వని అడిగిన తండ్రి హిరణ్యాక్షునికి ప్రహ్లాదుడు సమాధానం చెప్తున్నాడు. నాన్నగారు! నాచే ఈ గురువులు ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన సర్వ శాస్త్రాలు చక్కగా వల్లెవేయించారు. అలా ఎన్నో శాస్త్రాలు నేర్చుకొన్నాను. సర్వ శాస్త్రాల రహస్య సారాన్ని పరమార్థాన్ని ఆకళింపు చేసుకొన్నాను.
చదివించిరి = చదివించిరి; నను - ననున్ = నన్ను; గురువులు = గురువులు; చదివితి = చదివితిని; ధర్మార్థముఖ్య = ధర్మార్థకామ; శాస్త్రంబులు - శాస్త్రంబులున్ = శాస్త్రములను; నేఁ జదివినవి గలవు - నేన్ = నేను; చదివినవి = చదివినట్టివి; కలవు = ఉన్నవి; పెక్కులు = అనేకమైనవి; చదువులలో - చదువుల = చదువుల; లోన్ = అందలి; మర్మమెల్లఁ జదివితిఁ దండ్రీ - మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని; తండ్ర్రీ = తండ్రి.
  తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

2 comments:

Snigdha said...

Padyanni baga vivarincharu andi..

chala famous padyam idi..

Dhanyavadallu,
Snigdha.

vsrao5- said...

ధన్యవాదాలు మిత్రులు స్నిగ్ధగారికి. వారిని వారి వారిని ఆ ప్రహ్లాద భర్త చల్లగా చూస్తుండు గాక. తరచు క్షేమ సమాచారాలు తెలుపుతు ఉండు బంగారుతల్లి.